వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి తొలి ఏకగ్రీవం.
వీరులపాడు మండలం లో ఏకగ్రీవం లో తొలి విజయం.
వెల్లంకి సర్పంచిగా షేక్ హుస్సేన్ బి.
వీరులపాడు మండలం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో నందిగామ నియోజకవర్గం లోని వీరులపాడు మండలం వెల్లంకి గ్రామ పంచాయతీ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి ఏకగ్రీవ పంచాయతీగా నమోదయింది.
సర్పంచిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన షేక్ హుస్సేన్ బి ఎన్నికయ్యారు.
గ్రామంలో మొత్తం పది వార్డులకు గాను 10 వార్డులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కైవసం చేసుకున్నారు.
ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచి షేక్ హుస్సేన్ బి, మరియు పాలకవర్గం సభ్యులకు నందిగామ శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ లు అభినందనలు తెలిపారు.