
నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్
తేది 28/12/2020
వరంగల్ రూరల్ జిల్లా.
పరకాల నియోజకవర్గం.
-“గోదావరి జల సాధనకై “
_-కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఒక్కరోజు నిరసన(ధర్నా) కార్యక్రమం..
తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులైన దేవాదుల ఫేజ్-3, కాళేశ్వరం 3వ TMC ఎత్తిపోతల, రామప్ప- పాఖాల, రామప్ప-రంగాయ చెరువు, మిషన్ భగీరథ, తుపాకులగూడెం & సమ్మక్క-సారలమ్మ బ్యారేజిలను నిర్మాణ పనులను నిలిపివేయాలని కేంద్ర జలశక్తి మంత్రి ఇచ్చిన ఆదేశాలను రద్దుచేసి, ఆంక్షలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఒక్కరోజు నిరసన(ధర్నా) కార్యక్రమం సర్వ సిద్ధంగా ఉండాలని మండల అధ్యక్షులు తెలపడం జరిగింది.
ఈ నిరసన (ధర్నా) కార్యక్రమంలో పాల్గొననున్న పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట, భూపాలపల్లి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి , పెద్ది సుదర్శన్ రెడ్డి , ఆరూరి రమేష్ ,
గండ్ర వెంకటరమణ రెడ్డి .
‘గోదావరి జల సాధన’ పార్టీలకు అతీతంగా నిర్వహించే ఒక్కరోజు నిరసన(ధర్నా) కార్యక్రమానికి రూరల్ జిల్లాలోని రైతులు, ప్రజాప్రతినిధులు,వ్యవసాయ మార్కెట్ మరియు సొసైటీ చైర్మన్లు, రైతుబంధు సమీతీ సభ్యులు,తెరాస నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై నిరసన(ధర్నా) కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు.
తేదీ: 29-12-2020 (మంగళవారం),
సమయం: ఉ౹౹. 10:00 గం.లకు
వేదిక: హన్మకొండ పబ్లిక్ గార్డెన్ నుండి ర్యాలీగా కొనసాగి వరంగల్ రూరల్ కలెక్టరేట్ చేరి నిరసన(ధర్నా) ఈ కార్యక్రమానికి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మకూర్ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు లేతాకుల సంజీవరెడ్డి కోరడం జరిగింది
More Stories
ఇంటింటి ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం
రంగారెడ్డిజిల్లా, హైదరాబాద్,మహబూబ్ నగర్ పట్ట బద్రుల స్వతంత్ర MLC అభ్యర్థి K.నాగేశ్వర్ మొదటి ఓటు వేసి గెలిపించాలి- KVPS
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం